వచ్చేనెల 9 నుంచి ఎంటీఏ దశాబ్ది ఉత్సవాలు
మలేసియా తెలంగాణ అసోసియేషన్ (ఎంటీఏ) ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 9 నుంచి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మలేసియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సైదం తిరుపతి తెలిపారు. ఈ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణకు చెందిన అన్ని రాజకీయపార్టీల ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు. మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగే ఈ ఉత్సవాలకు అక్కడి తెలంగాణ వాసులు భారీగా హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మలేసియాలో పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Tags :