మంత్రి కొండా సురేఖ పై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా..
సినీ ఇండస్ట్రీకి (Cine industry), రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ టాలీవుడ్ (Tollywood) లో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ కూడా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాయి.. అలా ఎంత పలుకుబడి ఉన్నా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కుటుంబం అక్కినేని కుటుంబం{Akkineni Family) . అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ దుమారం లేపాయో అందరికీ తెలుసు. నాగచైతన్య ( Naga Chaitanya) విడాకులకు కేటీఆర్(KTR) కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.అక్కినేని ఫ్యామిలీతో పాటుగా ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
అంతేకాదు ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని నాగార్జున పేర్కొన్నారు. అంతేకాదు ప్రత్యర్ధులను విమర్శించడం కోసం అనవసరంగా సినీ ప్రముఖుల జీవితాలను ఉపయోగించుకోవడం మానుకోవాలి అంటూ సూచించారు. అక్కినేని నాగచైతన్య, సమంత డైవర్స్ (Naga Chaitanya samanatha divorce) తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
సంవత్సరాలు గడిచిపోతున్న ఈ విషయంపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు అక్కినేని ఫ్యామిలీ బాగా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఒక మంత్రి బాధ్యత మరిచిపోయి మాట్లాడుతున్నారని.. ఆమె భర్త కుటుంబం పై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడానికి నాగచైతన్య, సమంత జరిగిన వ్యవహారాన్ని హైలైట్ చేస్తున్నారని అందరూ మండిపడ్డారు. అమల సురేఖ తాను చెప్పిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పుకోవాలని అమల రాహుల్ గాంధీని కోరారు.
ఇటు కొండా సురేఖ వ్యవహారం పై జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) , నాని (Nani) కూడా ఘాటుగా స్పందించారు. మరోపక్క నాగార్జున ఆమెపై న్యాయ పోరాటానికి దిగడంతోపాటు పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబం గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సురేఖ వ్యాఖ్యలు చేశారు అని నాగార్జున నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఏ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ఆమె మాట్లాడిన మాటల వెనక ఉద్దేశం వేరని.. కేవలం మహిళల పట్ల ఒక నాయకుడికి ఉన్న చిన్న చూపు ధోరణి ప్రశ్నించడం కోసం అలా మాట్లాడిందే తప్ప.. సమంత మనోభావాలను దెబ్బతీయడానికి కాదు అని సురేఖ పేర్కొన్నారు.