సెన్సిబుల్ డైరెక్టర్ నెక్ట్స్ ఎవరితో?
![సెన్సిబుల్ డైరెక్టర్ నెక్ట్స్ ఎవరితో?](https://www.telugutimes.net/storage/news/news_new_75329.jpg)
లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకుని ధనుష్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. ధనుష్ తో పాటూ నాగార్జున కూడా కలిసి నటిస్తున్న కుబేర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది.
అయితే శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నానితో డిస్కషన్స్ చేస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం వారిద్దరి మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఏషియన్ సునీల్ నిర్మించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నాని ఆ సినిమా పూర్తైన వెంటనే హిట్3ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్ సెట్టయితే మాత్రం అది ఆడియన్స్ కు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఈ కాంబో ఆడియన్స్ కు మంచి కిక్కిస్తునందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తే తప్ప నమ్మలేం. నాని ఇది కాకుండా మరో రెండు కొత్త కథలపై కూడా చర్చలు జరుపుతున్నాడు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)