ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీ కుట్రలు బయటపడకుండా.. ఆ పార్టీ నేతలు ఇలా

వైసీపీ కుట్రలు బయటపడకుండా.. ఆ పార్టీ నేతలు ఇలా

వరద ముంపునకు  ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాది అయ్యేలా సైకో జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. అధికారం అండతో సైకో జగన్‌ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారు. 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్‌ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేయాలని కుట్ర చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాల నామరూపాలు లేకుండా చేసి లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైంది. దీన్ని ప్లాన్‌ చేసింది సైకో జగన్‌ అయితే, అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అని అన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :