ASBL NSL Infratech
facebook whatsapp X

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : మంత్రి లోకేశ్‌

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : మంత్రి లోకేశ్‌

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి లోకేశ్‌ అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆధికారులను ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆయన్ను కలిశారు. తమ పిల్లల్ని అక్కడ చేర్పించి నష్టపోతున్నామంటూ వాపోయారు. క్యాంపస్‌ మొత్తం గంజాయికి అడ్గాగా మారిందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోకేశ్‌ సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతానని హామీ ఇచ్చారు. గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపైనా కఠిన చర్యలకు ఆదేశించారు. విద్యాలయాల్లో వాటి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు చేపట్టిందని లోకేశ్‌ వివరించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :