బ్రేక్ తీసుకోనున్న నితిన్.. ఎందుకంటే..?
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నితిన్ నుంచి వచ్చిన ఆఖరి సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర డిజాస్టర్ అయింది. ప్రస్తుతం నితిన్ తనకు భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భీష్మ లానే అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాతో పాటూ దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమాను కూడా నితిన్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే నితిన్ ఈ రెండు సినిమాల షూటింగ్స్ నుంచి రెండు నెలల బ్రేక్ తీసుకోవాలని డిసైడైనట్లు తెలుస్తోంది.
నితిన్ భార్య షాలినీ ఇప్పుడు ప్రెగ్నెంట్. సెప్టెంబర్ లోనే డెలివరీ డేట్ ఇచ్చారట. దీంతో డెలివరీ తర్వాత బేబీతో పాటూ భార్యతో టైమ్ స్పెండ్ చేయాలని నితిన్ షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చూస్తున్నాడట. రాబిన్ హుడ్ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ అని నిర్మాతలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. తమ్ముడు సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనుకుంటున్న టైమ్ లో నితిన్ ఇలా రెండు నెలల పాటూ బ్రేక్ తీసుకుంటే ఆ సినిమాలు అనుకున్న టైమ్ కు రిలీజవుతాయా అనేది ప్రశ్నగా మారింది.