చంద్రబాబుకు అమెరికా కమ్మసంఘం విరాళం
ఆంధ్రప్రదేశ్ లో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకోసం అమెరికాలో ఉన్న నార్త్ అమెరికా కమ్మ సంఘం (ఎన్ ఎ కె ఎస్) వారు 30 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. దాతల సహకారంతో సేకరించిన విరాళాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెక్ రూపంలో అందించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు అశోక్ బాబు కొల్లా తదితరులు మాట్లాడుతూ ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా తాము అమెరికాలో ఉన్నప్పటికీ తమ మనసు ఎల్లప్పుడూ దేశ, రాష్ట్ర సమాజ హితం కోరుకుంటుందని చెప్పారు. ఈ వరద కష్టాల నుండి ప్రజలకు త్వరగా ఉపశమనం కలగాలని తాము భగవంతుడిని ప్రార్ధిస్తున్నామని అన్నారు.
విరాళాల సేకరణలో సహకరించిన సభ్యులు శ్రీనివాస్ ఉయ్యూరు, సురేష్ చన్నమల్లు, అనిల్ చిమ్మిలి, ప్రుదీష్ మక్కపాటి, శివ మొవ్వ, భానుప్రకాష్ గుళ్లపల్లి, భూషణ్ పాలడుగు, సురేంద్ర పాలడుగు, కృష్ణ నాయుడు, కోటేశ్వరరావు కందిమళ్ల, స్వాతి పోలవరపు, వెంకట్ నర్రా, లక్ష్మీనారాయణ ఉన్నం, నరేష్ గొల్ల, లక్ష్మణ్ పర్వతనేని, అక్షర చేబ్రోలు, కిషోర్ తమ్మినేని, రంజిత్ కోమటి, వెంకట్ ప్రేమ్చంద్ తానికొండ మరియు దాతలకు వారు సంఘం తరపున ధన్యవాదాలు తెలియచేశారు.