అరిజోనా యూనివర్సిటీ ఇంటెన్సివ్ సమ్మర్ ప్రోగ్రామ్
కంప్యూటర్ సైన్స్, ఐటీ, బ్లాక్చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్లర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న క్లిష్టమైన నైపుణ్య అంతరాల పరిష్కారమే లక్ష్యంగా భారత్లో తొలిసారి ఇంటెన్సివ్ సమ్మర్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు అమెరికాలోని నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ గ్లోబల్ అఫైర్స్ అసోసియేట్ వైస్ ప్రోవోస్ట్ సీజర్ ఫ్లోర్స్ తెలిపారు. రిసాయా అకాడమీ భాగస్వామ్యంతో మొదటిసారి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రోగ్రామ్ ఫీజులో 30 శాతం వరకు స్కాలర్షిప్ను మెరిట్ పద్ధతిన అందిస్తామని ఆయన తెలిపారు. మల్లారెడ్డి యూనివర్సిటీ వీసీ తదితరులు పాల్గొన్నారు.
Tags :