ASBL Koncept Ambience
facebook whatsapp X

మిల్‌ పిటాస్‌ లో ఎన్నారై టీడీపి ఆధ్వర్యంలో ఘనంగా శాంతి హోమం

మిల్‌ పిటాస్‌ లో ఎన్నారై టీడీపి ఆధ్వర్యంలో ఘనంగా శాంతి హోమం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి ప్రసాదంలా వినియోగించిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఎన్నారై టీడీపి నాయకుడు జయరామ్‌ కోమటి ఆధ్వర్యంలో మిల్‌ పిటాస్‌లోని వేదా టెంపుల్‌ లో శాంతి హోమం నిర్వహించారు. అక్టోబర్ 6వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడిపి నాయకులు, అభిమానులతోపాటు, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, జగన్‌ హయాంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎన్నో అపచారాలు జరిగాయని చెప్పారు. ఆ పాపాలను కడిగివేసి క్షమించమని శ్రీ వేంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇక్కడ శాంతిహోమం జరిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌ దొడ్డపనేని, భక్తబల్లా, వెంకట్‌ అడుసుమిల్లి, ప్రసాద్‌ మంగిన, విజయ ఆసూరి తదితరులు హాజరయ్యారు. 

 

Click here for Photogallery

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :