ASBL Koncept Ambience
facebook whatsapp X

అప్పుడు కాంగ్రెస్‌ ఉంటే.. ఎంఐఎంకు ఎలా ఇచ్చారు: సీఎం రేవంత్‌

అప్పుడు కాంగ్రెస్‌ ఉంటే.. ఎంఐఎంకు ఎలా ఇచ్చారు: సీఎం రేవంత్‌

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్‌ఎస్‌ సభ్యుల సంఖ్యను ప్రకటించారు. 38 మంది అని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. 2019 నుంచి అక్బరుద్దీన్‌ పీఏసీ చైర్మన్‌గా ఎలా ఉంటారు? కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ చైర్మన్‌ పదవి ఎలా ఇచ్చారు? బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా? బతకడానికి వచ్చినోళ్లు అంటూ కౌశిక్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిందే. కోర్టు తీర్పులు మాకే మేలు చేస్తాయి అని రేవంత్‌ అన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :