యంగ్ హీరోపై ఫోకస్ చేసిన పరశురామ్
డీజే టిల్లు(DJ Tillu), టిల్లూ స్వ్కేర్(Tillu Square) సినిమాలతో మంచి పాపులారిటీ అందుకున్న సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) కు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ప్రస్తుతం సిద్దూతో సినిమాలు చేయాలని డైరెక్టర్లంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జాక్(Jack), తెలుసు కదా(Thelusu Kadha) సినిమాలు చేస్తున్న సిద్దూ ఆ తర్వాత కోహినూర్(kohinoor), టిల్లూ క్యూబ్(Tillu Qube) సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది.
అయితే సిద్దూ కేవలం నటుడు మాత్రమే కాదు. మంచి రైటర్ కూడా. ఈ క్వాలిటీనే తన కెరీర్లో ఎదగడానికి ఎంతో దోహదపడింది. తనని తాను స్టార్ గా మలచుకోవడానికి సిద్దూలోని ఈ క్వాలిటీనే కీలకపాత్ర పోషించింది. ఇదిలా ఉంటే సిద్దూతో సినిమా చేయాలని గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్(Parasuram) ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. దిల్ రాజు(Dil Raju) ఈ సినిమాను నిర్మించాలని చూస్తున్నాడట. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాపై ఫుల్ క్లారిటీ రానుంది. ఫ్యామిలీ స్టార్(Family Star) తర్వాత పరశురామ్ మరో సినిమాను మొదలుపెట్టింది లేదు. సిద్దూ ఇమేజ్ కు తగ్గ స్టోరీతో పరశురామ్ అప్రోచ్ అవడంతో ఈ కలయిక సెట్టయ్యే ఛాన్సులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.