చంద్రయ్య హత్య రోజు నుంచే ఆయన రాజకీయ పతనం : ప్రత్తిపాటి
![చంద్రయ్య హత్య రోజు నుంచే ఆయన రాజకీయ పతనం : ప్రత్తిపాటి](https://www.telugutimes.net/storage/news/news_new_75203.jpg)
రౌడీమూకలకు ఇకపై గడ్డు రోజులేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. దానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టే సంకేతమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాచర్ల కేంద్రంగా పిన్నెల్లి నిర్మించిన నేర సామ్రాజ్యాన్ని పెకిలించాలన్నారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య రోజు నుంచే ఆయన రాజకీయ పతనం ప్రారంభమైందని తెలిపారు. పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా త్వరగా అరెస్ట్ చేయాలన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అండగా నిలిచిన పోలీసు సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :