సినిమాలపై క్లారిటీ ఇచ్చిన పవన్
![సినిమాలపై క్లారిటీ ఇచ్చిన పవన్](https://www.telugutimes.net/storage/news/news_new_75494.jpg)
ఏపీ ఎలక్షన్ ఫలితాల దగ్గర నుంచి పవన్ ఫ్యాన్స్ మామూలు హై ఫీలవడం లేదు. పవన్ పొలిటికల్ సక్సెస్ చూసి అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పవన్ రాజకీయంగా ఎంత యాక్టివ్ గా ఉన్నా ఆయన్ని సినిమాల్లో చూడాలనుకునే ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు పవన్ ను స్క్రీన్ పై చూస్తామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా ఓజి సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఓ రేంజ్ లో ఉన్నాయి. పవన్ వీలైనంత త్వరగా మేకప్ వేసుకుని సినిమా సెట్స్ లో అడుగుపెడతారనుకుంటే రీసెంట్ గా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ తన ఫ్యాన్స్ తో పాటూ నిర్మాతలకు కూడా ఓ క్లారిటీ ఇచ్చేశాడు. కనీసం మూడు నెలల పాటూ ఏకధాటిగా పాలన మీద ఫోకస్ చేసి సాల్వ్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని, రోడ్లపై గుంతలు పూడ్చుకుండా, హామీలు నెరవేర్చకుండా ఓజి సెట్స్కి వెళ్తే జనం క్యాజీ అంటారని అందుకే తన కర్తవ్యం ప్రస్తుతం సినిమాల్లో నటించడం కాదని తేల్చేశాడు.
వీలు చూసుకుని నెలకు రెండు మూడు డేట్స్ ఇచ్చి సహకరిస్తానని, అప్పటివరకు కాస్త ఓపిక పట్టాలని నిర్మాతలకు తెలియచేశారు. పవన్ మాటల్ని బట్టి చూస్తుంటే దసరా తర్వాత కానీ తను షూటింగ్ కు వెళ్లేట్లు కనిపించడం లేదు. కానీ వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం మాత్రం డిసెంబర్ లో సినిమా రిలీజ్ అంటున్నారు. మరి ఇదెంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. అంతేకాదు పవన్ చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు కాకుండా కొత్త సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)