దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్గా తీసుకున్నారు : పవన్ కల్యాణ్
![దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్గా తీసుకున్నారు : పవన్ కల్యాణ్](https://www.telugutimes.net/storage/news/news_new_75414.jpg)
గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్ కల్యాణ్ అసెంబ్లీ లో అడుగుపెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో పవన్ మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసింది. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారు. అందుకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న మనిషికి అండగా నిలవాలనుకున్నా. మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారు. 100 శాతం స్ట్రయిక్ రేటు దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చూడలేదన్నారు.
పవన్ కల్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాక నీయమన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. గేటు తాకడం ఏంటి బద్దలుగొట్టుకుని వస్తారని వర్మ చెప్పారు. ఆ మాటలు నిజమయ్యాయి. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారు. కానీ, బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదు. నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పా. వచ్చిన ఆదాయంతో ట్యాక్స్ కట్టాను. ఇప్పుడు మీ డబ్బు కాబట్టే ప్రతి రూపాయికి అధికారులను లెక్కలు అడుగుతున్నా. బాధ్యతగా ఉండాలనే మా శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నాం అని అన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)