ASBL Koncept Ambience
facebook whatsapp X

విచారణ పూర్తయితే దోషులు బయటకు : మంత్రి పయ్యావుల

విచారణ పూర్తయితే  దోషులు బయటకు : మంత్రి పయ్యావుల

వైఎస్‌ జగన్‌ అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్‌ మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల ప్రాశస్త్యం గురించి గతంలో ఎప్పుడైనా జగన్‌ మాట్లాడారా? నెయ్యి టెండర్ల విధానాన్ని సర్వనాశనం చేశారు. వైసీపీ పాలనలో తిరుమల అపవిత్రమైంది. డిక్లరేషన్‌ ఇవ్వాల్సి వస్తుందని కొండకు వెళ్లని వ్యక్తి జగన్‌. వెంకన్నను నమ్ముతున్నానని ఒక్కమాట కూడా చెప్పలేదు. తిరుమలలో అద్భుతమైన వ్యవస్థను కాపాడారా?తిరుమల వెళ్లేందుకు బద్దకించి ఇంట్లోనే ఆలయం సెట్‌ వేశారు. సుప్రీం ఆదేశాలను వక్రీకరించిగల సమర్థుడు జగన్‌. తీర్పు కాపీ రాకముందే ప్రెస్‌మీట్‌ పెట్టి వక్రీకరించారు. జగన్‌ చెప్పేవన్నీ జనం నమ్ముతారనుకోవడం ఆయన భ్రమ. విచారణ పూర్తయితే దోషులు బయటకు వస్తారు అని అన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :