ASBL NSL Infratech
facebook whatsapp X

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులకు... మరోసారి ఎదురుదెబ్బ

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులకు... మరోసారి ఎదురుదెబ్బ

ఫోన్‌ ట్యాపింగ్‌  కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ (తప్పనిసరి) బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఏ2 ప్రణీత్‌రావు,  ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటివరకు ఛార్జిషీట్‌ నమోదు కానందున వారికి బెయిల్‌ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు ఛార్జీషీట్‌ దాఖలు చేశామని, దాన్ని తిప్పి పంపినంత మాత్రాన అసలు దాఖలు చేయనట్టు కాదు అన్నారు. ఇరువైపులా వాదనలు ముగియగా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :