రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. సాదర స్వాగతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్ డ్యాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దాండియా, గర్బా నృత్యంతో భారత ప్రధానిని స్వాగతించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్లారు. రెండు రోజుల పాటు పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపున్నారు. ఇక, మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు.
Tags :