ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ... క్వాడ్ లీడర్స్ సదస్సుకు హాజరు

అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ... క్వాడ్ లీడర్స్ సదస్సుకు హాజరు

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మోడీ పర్యటన .. విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా మోడీ... క్వాడ్ లీడర్స్ సదస్సుకు హాజరు కానున్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. వివిధ దేశాల నేతలతో కూడా సమావేశం కానున్నారు ప్రధాని మోడీ. అనంతరం వివిధ సంస్థల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 21వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆధ్వర్యంలో విల్మింగ్టన్‌‌లో జరగనున్న నాలుగో క్వాడ్‌ సదస్సుకు మోడీ హాజరవుతారు. అయితే క్వాడ్ సదస్సును ఈ ఏడాది భారత్‌లో నిర్వహించాల్సి ఉంది. అమెరికా చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నిర్వహించేందుకు భారత్‌ అంగీకరించింది. ఈ క్వాడ్‌లో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. మెరుగైన రేపటి కోసం బహుపాక్షిక పరిష్కారాలు’ అనేది సమ్మిట్ యొక్క థీమ్. సమ్మిట్‌లో పెద్ద సంఖ్యలో ప్రపంచ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది.

సమ్మిట్ సందర్భంగా, ప్రధాన మంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు మరియు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. డెలావేర్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో నరేంద్ర మోడీసమావేశం కానున్నారు. క్వాడ్ నాయకులు.. క్వాడ్ సాధించిన పురోగతిని సమీక్షించడానికి, భవిష్యత్తు ఎజెండాను రూపొందించనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వారి అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను అందుకోవడంలో సహాయం చేయడానికి వచ్చే ఏడాదికి సంబంధించిన ఎజెండాను కూడా ఇదే క్వాడ్ సమావేశంలో నిర్దేశించనున్నారు. ఈ క్వాడ్ సదస్సు సందర్భంగా పలువురు ప్రపంచ నేతలతో కలిసి ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇందులో రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే సమయంలో సెప్టెంబరు 22వ తేదీన న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయో టెక్నాలజీ, సెమీ కండక్టర్లు సహా ఇతర రంగాల్లో భారత్‌తో సహకారాన్ని పెంపొందించేందుకు గాను అమెరికాలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. భారత్‌- అమెరికా సంబంధాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖులతోనూ మోడీ చర్చించనున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :