ASBL Koncept Ambience
facebook whatsapp X

పారాలింపిక్స్‌ విజేతలతో ప్రధాని మోదీ.. ఆత్మీయ సమావేశం

పారాలింపిక్స్‌ విజేతలతో ప్రధాని మోదీ.. ఆత్మీయ సమావేశం

పారిస్‌ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌ భారత అథ్లెట్లు సత్తా చాటారు. మొత్తం 29 పతకాలను సాధించారు. స్వదేశానికి చేరుకున్న విజేతలతో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పతకాలను సాధించడం అభినందనీయం. వారి అంకితభావంతోనే ఇది సాధ్యమైంది. ఎంతోమందికి ఇది స్ఫూర్తిదాయకం అని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ భేటీలో కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీ, పారాలింపిక్స్‌ కమిటీ ఆప్‌ ఇండియా ( పీసీఐ) హెడ్‌ దేవంద్ర జజారియా కూడా పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :