వ్యవసాయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఉద్వానవన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవానా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి రైతే వెన్నుముక అలాంటి రైతు కష్టాలను తీర్చేలా ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని పోచారం కోరారు. వ్యవసాయదారుడు దేశానికి అన్నం పెట్టేవాడని, ఆయనను సరిగ్గా చుసుకుంటే దేశ ప్రగతి సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోయినా, రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, ప్రాజెక్టులు పూర్తి వంటి వాటికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవంతో సలహాలు ఇస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.