సందీప్ మాటలతో ఖుషి అయిన డార్లింగ్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం ఇండియాలోనే పెద్ద హీరో. ప్రభాస్ మూవీకి మంచి టాక్ వస్తే మినిమం రూ.500 కోట్లు వస్తాయి. రూ.1000 కోట్ల మార్క్ ను చేరడం కూడా ప్రభాస్ కు పెద్ద కష్టమేమీ కాదు. అలాంటి ప్రభాస్ హీరోగా ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) అనే సినిమా రానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి కూడా రెండేళ్లవుతుంది. కానీ ప్రభాస్, సందీప్ కు వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల సినిమా సెట్స్ పైకి వెళ్లడం లేట్ అయింది. నెక్ట్స్ ఇయర్ ఈ సినిమా మొదలయ్యే ఛాన్సుంది. అయితే రీసెంట్ గా పొట్టేల్(Pottel) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టు గా వచ్చిన సందీప్ రెడ్డి వంగా అక్కడ స్పిరిట్ గురించి ప్రస్తావించాడు.
ప్రభాస్ తో తీయబోయే స్పిరిట్ ఎలాంటి సినిమా అని యాంకర్ సుమ(Anchor Suma) అడగ్గా, పోలీస్ స్టోరీ అని ఓ పలక మీద రాసి రివీల్ చేశాడు సందీప్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమా పోలీస్ కథతో తెరకెక్కనుందని నెట్టింట ప్రచారమవగా, ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టరే స్పష్టం చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.