కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన పీకే
ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచీ ఆమోదం పొందిందని వెల్లడిరచారు. దీంతో బిహార్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు.
కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించాం. అయితే ఈ పార్టీకి నాయకత్వం మాత్రం నా చేతుల్లో లేదు. రెండేళ్లుగా దీని కోసం శ్రమించిన వారే ఈ నిర్ణయం తీసుకుంటారు అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
Tags :