ASBL NSL Infratech
facebook whatsapp X

జిడబ్ల్యుటీసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. ఎపి మంత్రులకు, స్పీకర్‌కు అధ్యక్షుడు కృష్ణ లాం ఆహ్వానం

జిడబ్ల్యుటీసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. ఎపి మంత్రులకు, స్పీకర్‌కు అధ్యక్షుడు కృష్ణ లాం ఆహ్వానం

వాషింగ్టన్‌లోని తెలుగువాళ్లకు గత 50 సంవత్సరాలుగా సేవలందిస్తున్న  గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు కల్చరల్‌ సంఘం (జిడబ్ల్యుటిసిఎస్‌) ఏర్పాటై 50 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో గోల్డెన్‌ జూబ్లి వేడుకలను వాషింగ్టన్‌ డీసీలో సెప్టెంబర్‌ 27,28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, రాజకీయ నాయకులతో ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణ లాం చెప్పారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం స్వయంగా కలిసి ఆహ్వానించారు. 

తన ఇండియా పర్యటనలో భాగంగా తెలుగు దేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి లోకేష్‌ను, రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి అనిత, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, టిడిపి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, సంగం డెయిరీ చైర్మన్‌, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, సినిమా దర్శకుడు కొరటాల శివను కృష్ణ లాం కలుసుకుని స్వర్ణోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణలో కూడా పలువురు ప్రముఖులను కలిసి ఈ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు కృష్ణలాం తెలిపారు.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :