ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికాలో ప్రధాని మోదీ సభకు .. 24 వేల మంది నమోదు

అమెరికాలో ప్రధాని మోదీ సభకు .. 24 వేల మంది నమోదు

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో సెప్టెంబరు 22న పాల్గొననున్న కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. న్యూయార్క్‌ సమీప లాంగ్‌ఐలాండ్‌లోని నసావు వెటరన్స్‌ మెమోరియల్‌ కొలిసియంలో మోదీ  యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌ ను నిర్వహించనున్నారు. దీనికి హాజరయ్యేందుకు ఇప్పటికే 24 వేల మంది ప్రవాస భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నట్లు ఇండో`అమెరికన్‌ కమ్యూనిటీ ఆఫ్‌ యూఎస్‌ఏ (ఐఏసీయూ) తెలిపింది. అయితే, ఈ వేదిక సామర్థ్యం 15 వేల మంది మాత్రమే. భారీ సంఖ్యలో  పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 

కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు హాజరవుతారని అంచనా. కార్యక్రమంలో మోదీ ప్రసంగంతో పాటు భారతీయ అమెరికన్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. మరో వైపు ఐరాస విడుదల చేసిన ఉపన్యాసకుల తాత్కాలిక జాబితా ప్రకారం సెప్టెంబరు 26న న్యూయార్క్‌లో జరిగే అత్యున్నత స్థాయి యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :