మహేష్-రాజమౌళి సినిమా విలన్ అతనేనా?
![మహేష్-రాజమౌళి సినిమా విలన్ అతనేనా?](https://www.telugutimes.net/storage/news/news_new_75401.jpg)
గుంటూరు కారం సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిక్స్ అయ్యాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కానీ లీకైన సోర్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ వార్త ఎక్కువగా వినిపిస్తోంది.
అడవుల బ్యాక్ డ్రాప్ లో భారీ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎవరు ఎలాంటి పాత్రలు చేయనున్నారనే విషయం ఇంకా తెలియదు. ఈ విషయమై రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవరకు సస్పెన్స్ ఇంతే కొనసాగనుంది. అయితే ఓ వైపు హీరోగా, మరోవైపు డైరెక్టర్ గా ఎంతో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ ఇప్పుడు ఈ సినిమాకు అవసరమైనన్ని డేట్స్ ఇవ్వగలడా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.
పృథ్వీరాజ్ అనుకుంటే అదేమీ పెద్ద కష్టం కాదు. మరి పృథ్వీరాజ్ మనసులో ఏ ఆలోచన ఉందో? అసలు రాజమౌళి ఈ విషయమై అతన్ని సంప్రదించాడో లేదో కూడా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే సలార్ సినిమా చూసే రాజమౌళి పృథ్వీరాజ్ ను విలన్ గా తీసుకోవాలనుకున్నాడని అందరూ అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)