వయనాడ్లో నామినేషన్ వేసిన ప్రియాంకాగాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఆమె నామినేషన్ వేశారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు వెంట రాగా ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. నేను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి నా తండ్రి కోసం ప్రచారంలో పాల్గొన్నాను. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో నా తల్లి, సోదరుడు, నా తోటీ నేతల కోసం ప్రచారంలో పాల్గొన్నాను. కానీ నాకోసం ప్రచారం పాల్గొనడం ఇదే తొలిసారి. వయనాడ్లో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నాకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నా కుటుంబానికి కృతజ్ఞతలు. మీరు అవకాశం ఇస్తే, మీకు ప్రాతినిధ్యం వహించడాన్ని నేను గౌరవంగా భావిస్తాను అని ఆమె వెల్లడించారు.
Tags :