ASBL NSL Infratech

యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌లో... భారత ప్లేయర్‌ శుభారంభం

యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌లో... భారత ప్లేయర్‌ శుభారంభం

యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ ప్రియాన్షు రజావత్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రియాన్షు 21-16, 21-18తో జాన్‌ లూడా ( చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌ కూడా ప్రిక్వార్టన్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది.  తొలి రౌండ్‌లో మాళవిక 21-14, 21-15తో క్రిస్టన్‌ కుబా( ఎస్తోనియా)పై నెగ్గింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని` రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 15-21, 21-18, 13-21తో అలెగ్జాండర్‌ డన్‌-జూలీ మాక్‌పెర్సన్‌ (స్కాట్లాండ్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :