డైరెక్టర్ గా పూరీ రిటైర్ అవుతున్నాడా?
ఎన్నో అంచనాలతో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కెరీర్ కు మాయని మచ్చగా మారింది. ఒకవేళ ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ లాగా హిట్ అయుంటే ఏదో ఒక హీరో పిలిచి ఛాన్స్ ఇచ్చేవాడు కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. లైగర్ చేసిన నష్టం, గాయం డబుల్ ఇస్మార్ట్ ను బాగా వెంటాడాయి.
ఫలితంగా లైగర్ కంటే డబుల్ ఇస్మార్ట్ దారుణమైన రిజల్ట్ ను ఇచ్చింది. డబుల్ ఇస్మార్ట్ ప్లేస్ లో ముందు అనుకున్న జనగణమన చేసినా పూరీ ట్రాక్ రికార్డ్ మరోలా ఉండేదేమో. విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే హీరోయిన్ గా మిలటరీ బ్యాక్ డ్రాప్ లో దేశ భక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికీ పూరీ దగ్గర రెడీగా ఉంది. లైగర్ ఫ్లాప్ వల్ల విజయ్ ఆ సినిమాను క్యాన్సిల్ చేసేశాడు.
ఇప్పుడు పూరీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తేజ సజ్జకు కథ వినిపించాడన్నారు కానీ అవన్నీ పుకార్లేనని తెలుస్తోంది. తన కొడుకు ఆకాష్ చేస్తున్న తల్వార్ సినిమాలో పూరీ ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కాసేపు కనిపించి అలరించిన పూరీకి ఇప్పుడు తల్వార్ డైరెక్టర్ ఓ పాత్ర ఇచ్చాడట. పూరీ పూర్తి స్థాయి నటుడిగా మారితే ఇక సినిమాలు చేయకుండా డైరెక్టర్ గా రిటర్ అయిపోయినట్టేనా అని ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.