ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు... లూటిఫికేషన్ : కేటీఆర్
డబ్బు సంచుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమతిచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ వెనకుండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ పంపిస్తున్నారని ఆరోపించారు. హైడ్రాను నడిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కాదని, రాహుల్ గాంధీయేనని వ్యాఖ్యానించారు. కేవలం డబ్బు కోసమే మూసీ ప్రాజెక్టును చేపట్టారు. బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఈ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్కు ఇస్తారో త్వరలో బయటపెడతా. కాంగ్రెస్కు నోట్ల కట్టలు కావాలి కానీ, బాధితుల కష్టాలు పట్టవా? ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. దీనిపై డీపీఆర్ కాదు, ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదు. దీనికోసం డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ అంశంపై 2`3 రోజుల్లో వపర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తా, సీఎం, మంత్రులకు సయోధ్య ఉన్నట్లు లేదు. ఈ సీఎం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు అని అన్నారు.