మహేష్ కోసం జంతు ప్రపంచాన్ని వాడనున్న జక్కన్న
ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మహేష్ బాబు(Mahesh Babu)- రాజమౌళి(rajamouli) కలయికలోని సినిమా ఎదురుచూస్తున్న కొద్దీ లేటవుతూ వస్తుంది. ఈ పాన్ ఇండియా సినిమాకి అడుగులు దగ్గర పడుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో సినిమాను అనౌన్స్ చేస జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయట.
ఇండియాలోనే మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే రీసెంట్ గా రాజమౌళి ఓ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ లో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు.
ఆర్ఆర్ఆర్(RRR) కంటే ఎస్ఎస్ఎంబీ29(SSMB29)లో ఎక్కువ జంతువులను వాడబోతున్నట్లు రాజమౌళి చెప్పడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఆసక్తి డబుల్ అయింది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో సీన్, ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో జంతువులను వాడి సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన రాజమౌళి ఈసారి ఏకంగా జంతు ప్రపంచాన్ని చూపిస్తే మాస్ ఆడియన్స్ కు మెంటలెక్కడం ఖాయం.