మేడమ్ టుస్సాడ్స్లో చరణ్ తో పాటూ రైమ్ విగ్రహాలు
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్(madame Tussauds) లో ఇప్పటికే టాలీవుడ్ స్టార్ల మైనపు విగ్రహాలు కొలువు దీరి ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్(Prabhas), మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్(Allu ARjun), కాజల్(Kajal) సహా పలు భాషలకు చెందిన స్టార్ హీరోల విగ్రహాలను అందులో ఉంచారు. అయితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Powerstar Ram Charan) మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడస్ లో ఆవిష్కరించనున్నటుల రీసెంట్ గా ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే చరణ్ విగ్రహంతో పాటూ ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్క పిల్ల రైమ్(Rhyme) విగ్రహాన్ని కూడా మేడమ్ టుస్సాడ్స్ లో ఉంచనున్నారట. దీని కోసం అచ్చు వేసే ప్రకియ ప్రస్తుతం కొనసాగుతోంది. చరణ్ ఇప్పటికే దాని కోసం కొలతలను కూడా అందించాడు. మైనపు బొమ్మ నిర్మాణానికి చరణ్ పూర్తిగా సహకరిస్తున్నాడని సమాచారం.
ఈ వార్త విన్న చరణ్ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు చరణ్- రైమ్ మైనపు విగ్రహాలు రెడీ అవుతాయా, చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. ఇదే ఏడాది మార్చిలో అల్లు అర్జున్(Allu Arjun) మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.