చైతూ కోసం సినిమాను సెట్ చేసిన రానా
గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య(naga chaitanya) ఫోకస్ మొత్తం ప్రస్తుతం తండేల్(thandel) పైనే ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు చైతూ(Chaitu). ఈ సినిమాను ముందుగా క్రిస్మస్ కు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడా ఆలోచన మారింది. సంక్రాంతికి రిలీజ్ చేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు.
త్వరలోనే తండేల్ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే తండేల్ సినిమా ఓ కొలిక్కి వచ్చేవరకు చైతూ వేరే సినిమా గురించి ఆలోచించలేదు. వేరే కథలు కూడా వినలేదు. ఇప్పుడు తాజాగా చైతూ కొత్త సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కిషోర్(Kishore) అనే కొత్ డైరెక్టర్ చెప్పిన కథకు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
వాస్తవానికి ముందుగా ఈ కథను కిషోర్, రానా దగ్గుబాటి(rana Daggubati)కి చెప్పాడట. కానీ ఈ కథ తనకంటే చైతూకి బాగా సూటవుతుందని చైతూకి వినిపించాడట. చైతూకి కూడా ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. అంతేకాదు రానాకు ఈ కథ బాగా నచ్చి ఈ మూవీ కోసం నిర్మాతను కూడా సెట్ చేశాడని, తాను కూడా ఇందులో పార్టనర్గా ఉండటానికి ముందుకొచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రానుంది. తండేల్ తర్వాత చైతూ చేయనున్న సినిమా ఇదేనని సమాచారం.