700 మందితో చిందేసిన రష్మిక
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రష్మిక మందన్నా వరుసపెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. యానిమల్ సినిమా తర్వాత రష్మికకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతానికి ఈ అమ్మడు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో చావా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం రష్మిక అన్ని సినిమాల కంటే ఎక్కువగా కష్టపడుతుంది.
చావా సినిమా రష్మిక కెరీర్లో చాలా స్పెషల్ మూవీ అనే టాక్ సైతం వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రష్మికపై భారీ బడ్జెట్ తో సాంగ్ ను షూట్ చేశారట. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా ఏకంగా 700 మంది డ్యాన్సర్లతో రష్మిక భారీ సాంగ్ను చేసిందట.
రష్మిక అంతమందితో కలిసి చేసిన డ్యాన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందంటున్నారు. ఆ పాటలో రష్మిక మందన్నా మునుపెన్నడూ లేని విధంగా చాలా అందంగా కనిపించడంతో పాటూ ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేసినట్లు సమాచారం. విక్కీ కౌశల్ కెరీర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఈ సినిమా అత్యధిక బడ్జెట్ సినిమాగా వార్తలొస్తున్నాయి.