ASBL Koncept Ambience
facebook whatsapp X

సీఎం రేవంత్‌రెడ్డికి ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆహ్వానం

సీఎం రేవంత్‌రెడ్డికి ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆహ్వానం

నవరాత్రోత్సవాలకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఖైరతాబాద్‌లోని గణేశ్‌ నవరాత్రోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా ఇక్కడ పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా 70 అడుగుల పెద్ద విగ్రహాన్ని నెలకొల్పి, వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌లో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. 

జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, ఇతర కాంగ్రెస్‌ నాయకులు రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా అర్చకులు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం దానం నాగేందర్‌ సీఎంకు శాలువా కప్పి సత్కరించారు. ఈ మేరకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు సీఎంకు  పుష్పగుచ్ఛం అందజేసి, ఉత్సవాలకు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :