బంపరాఫర్ కొట్టేసిన రుక్మిణి
గతేడాది వచ్చిన సప్తసాగరాలు దాటి సైడ్ ఎ(Sapta Sagaralu daati), బి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ఆ సినిమాల్లో గ్లామర్ షో చేయకపోయినా యాక్టింగ్ తోనే ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. నటనా ప్రాధాన్యముండే సినిమాల్లో నటించేందుకు ప్రాధాన్యమిస్తున్న రుక్మిణి వసంత్ టాలీవుడ్ ఎంట్రీకి సరైన ప్లానింగ్ తోనే వస్తోంది. నిఖిల్(Nikhil) తో రుక్మిణి చేసిన డెబ్యూ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo) ఈ నెలాఖరున దీపావళి సందర్భంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
అయితే ఇది ఎప్పుడో సైన్ చేసిన సినిమా. అయితే అసలు వార్త ఇది కాదు. జూ. ఎన్టీఆర్(Jr.Ntr) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి వసంత్ ఆల్మోస్ట్ ఫిక్సయినట్లు సమాచారం. ఇప్పటికే నీల్ కథ అందించిన శ్రీ మురళి బఘీరా(Bagheera)లో రుక్మిణినే హీరోయిన్. ఇది కాకుండా శివ కార్తికేయన్(Siva Karthikeyan), విజయ్ సేతుపతి(Vijay Sethupathi), శివరాజ్ కుమార్(Sivaraj Kumar)తో కూడా సినిమాలు చేస్తోంది.
అయితే తారక్ తో సినిమా లాక్ అయితే రుక్మిణికి డబుల్ ప్రమోషన్ దక్కినట్టే. కెజిఎఫ్(KGF), సలార్(Salaar) కంటే గొప్పగా నీల్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను డిజైన్ చేశాడట. నిజానికి రుక్మిణి వసంత్ రవితేజతో కూడా సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింవది. రవితేజ(Ravi Teja)తో ఛాన్స్ మిస్ అయినా ఎన్టీఆర్ సినిమాలో సెలెక్ట్ అయిందంటే మాత్రం రుక్మిణికి అంతకంటే పెద్ద ఆఫర్ ఇంకేముంటుంది.