రుక్మిణి టాలీవుడ్ ఎంట్రీ ఎవరితో అంటే..!
సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బి సినిమాలతో నటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది ఆ సినిమాల్లోని హీరోయిన్ రుక్మిణి వసంత్. ఆ సినిమాల తర్వాత అమ్మడికి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మంచి లుక్స్ తో పాటూ యాక్టింగ్ కూడా బావుండటంతో అందరూ ఆమెకు ఫిదా అయిపోయారు.
అయితే తెలుగులో అమ్మడితో సినిమాలు చేయాలని పలువురు డైరెక్టర్లు ట్రై చేశారు కానీ ఏదీ కుదరలేదు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వంలో రానున్న సినిమాలో రుక్మిణిని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్సయినట్లే అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ మంచి బట్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. ఇప్పటికే నాలుగు సినిమాలు రుక్మిణి చేతిలో ఉన్నాయి. విజయ్ సేతుపతి ఏస్ రిలీజ్ కు రెడీ అవుతుండగా, బఘీరా షూటింగ్ జరుపుకుంటోంది. శివరాజ్ కుమార్ భైరతి రణగల్ తో పాటూ శివ కార్తికేయన్ మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు రామ్ తో సినిమా చేస్తే టాలీవుడ్ లో కూడా మంచి ఎంట్రీ దొరికినట్లవుతుంది.