మాస్ డైరెక్టర్ తో శర్వా సినిమా
సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శర్వానంద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి సినిమాలను చేస్తూ ఫ్యామిలీ హీరో అనే పేరు తెచ్చుకున్నాడు శర్వా. రీసెంట్ గా మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్ ఆ సినిమాతో హిట్ అందుకుని నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చిపెట్టాడు. ఒకే ఒక జీవితం సినిమా తర్వాత కొంత కాలం పాటూ గ్యాప్ తీసుకున్న శర్వానంద్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా ఓ సినిమాను చేస్తున్నాడు. అభిలాష్ దర్శకత్వంలో యువి బ్యానర్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాల షూటింగ్ సమాంతరంగా జరుగుతున్నాయి. వీటి తర్వాత శర్వా సంపత్ నందితో కలిసి సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఓ మాస్ సినిమాను శర్వాతో చేయాలని సంపత్ చూస్తున్నాడట. అయితే శర్వాతో సంపత్ నంది చేయబోయే సినిమా సాయి ధరమ్ తేజ్ తో ఆగిపోయిన గాంజా శంకరే అని కొందరంటున్నారు. కానీ అవన్నీ రూమర్లేనని సంపత్ ప్రస్తుతం శర్వా కోసం కొత్త కథను రాస్తున్నాడని ఆయన సన్నిహితులంటున్నారు. ఓదెల2 సినిమా పూర్తయ్యాక వీరిద్దరి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.