ASBL NSL Infratech

బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌... ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌... ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు

 

బీఆర్‌ఎస్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా  గుంభనంగా సాగిపోయింది. అర్ధరాత్రి ఒంటి గంటల సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌  వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, బస్వరాజు సారయ్య, దండె విఠల్‌, ఎంఎస్‌ ప్రభాకర్‌, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ పార్టీ మారారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో సమావేశమైన వారు రాత్రి 11:30 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసానికి చేరుకునానరు. ముఖ్యమంత్రి ఢల్లీి పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సురేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :