వేదిక కూలి ఝాన్సీరెడ్డికి గాయాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో కాంగ్రెస్ నేత WETA వ్యవస్థాపకురాలు ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటి ప్రియాంక మోహన్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. నటి ప్రియాంక, కాంగ్రెస్ నేత రaాన్సీ ఇద్దరూ ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. తీవ్రంగా గాయపడిన రaాన్సీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త. . మరోవైపు ప్రమాదం నుంచి బయటపడిన నటి ప్రియాంక మోహన్ను అక్కడున్న సిబ్బంది షాపింగ్ మాల్ లోపలికి తీసుకెళ్లారు. ఒక్కసారి ప్రజలు వేదికపైకి రావడంతో అది కుప్పకూలినట్లు తెలుస్తోంది.
Tags :