ASBL Koncept Ambience
facebook whatsapp X

‘ప్రణయగోదారి’ నుంచి ‘తెల్లారుపొద్దుల్లో’ పాటను రిలీజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్

‘ప్రణయగోదారి’ నుంచి ‘తెల్లారుపొద్దుల్లో’ పాటను రిలీజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పైగా కొత్త వారు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది.

ప్రణయ గోదారి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ సాగే ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉన్నాయి. ధనుంజయ్,  అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది.

 *శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ..* ‘ప్రణయగోదారి పాటను ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. దర్శక నిర్మాత విఘ్నేష్ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశాడని అర్థం అవుతోంది. మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :