ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం నో
ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తొసిపుచ్చింది.. ఈ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న కోర్టులోనే విచారణ కొనసాగించాలని ఆదేశించింది .. కాగా, జగదీష్ పిటిషన్ పై నేడు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులో రేవంత్రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం అపోహ మాత్రమేనని అభిప్రాయ పడింది. ఈ విషయంలో ఊహాజనిత జగదీష్ రెడ్డి పిటిషన్ ను ఆమోదించలేమని పేర్కొంది. స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఓటు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి ఊరట లభించినట్లైంది.