ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎమ్మెల్సీ కవితకు షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఎమ్మెల్సీ కవితకు షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ మద్యం వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోరారు. ఈ నెల 20న విచారిస్తామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం సృష్టం చేసింది.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :