టీ హబ్తో బియాండ్ ఒప్పందం
మలేషియాకు చెందిన బియాండ్ 4తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది టీ హబ్. టీ హబ్ కార్యాలయంలో బియాండ్ 4 సీఈవో ఎస్టీ రుబనేశ్వరన్, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు మాట్లాడుతూ బియాండ్ 4తో కుదుర్చుకున్న ఒప్పందంతో భారత్తో పాటు మలేషియాల మధ్య బలమైన స్టార్టప్ ఎకోసిస్టం పెంపొందించడానికి వీలు పడుతుందన్నారు. రెండు సంస్థలు కలిసి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయని, ఇదే సమయంలో పెట్టుబడులు మరింత సులభతరం కానున్నదన్నారు. బియాండ్ 4 మలేషియా సంస్థ సీఈవో ఎస్టీ రుబనేశ్వరన్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నదని, ఆర్ఎం 345.9 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.
Tags :