తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో అక్టోబర్ 8వ తేదీన 50 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను పంపిణీ చేశారు. దాదాపు 5 లక్షల రూపాయల విలువైన ఈ స్కాలర్ షిప్ లను వెంకట్ జిల్లెళ్లమూడి స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లను పంపిణీ చేసే అవకాశం ఇచ్చినందుకు తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కో ఆర్డినేటర్ శ్రీకాంత్ పోలవరపులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉప్పుటూరి చినరాములు పర్యవేక్షించగా, బండి నాగేశ్వరరావు విజయవంతానికి కృషి చేశారు. స్కాలర్ షిప్ లు అందుకున్న విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లితండ్రులు తానాకు ధన్యవాదాలు తెలియజేశారు.
Tags :