ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో.. రామోజీరావుకు నివాళులు
అమెరికాలోని డాలస్లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో భాగంగా రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి సాయిబాబా ఆలయ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమావేశంలో ఏలూరుకు కళారత్న కె.వి.సత్యనారాయణను సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, తానా పూర్వ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, తెలుగు సంఘం సభ్యులు సత్కరించారు.
Tags :