నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించండి .. కేంద్ర మంత్రి అమిత్ షా తో రేవంత్ రెడ్డి
![నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించండి .. కేంద్ర మంత్రి అమిత్ షా తో రేవంత్ రెడ్డి](https://www.telugutimes.net/storage/news/news_new_75450.jpg)
తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. సుమారు గంటపాటు కొనసాగిన భేటీలో వివిధ అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. డ్రగ్స్ మరియు సైబర్ నేరాల నియంత్రణతో పాటు అరికట్టడానికి కావల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాబ్కు రూ.88 కోట్లు, టీజీ సీఎస్బీకి రూ.90 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసరని, తెలంగాణకు సంబంధించి 2016లో మొదటి సారి సమీక్ష నిర్వహించారని, నాటి నుంచి సమీక్ష చేయనుందున వెంటనే సమీక్ష చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్లు సరిపోనందున, తెలంగాణకు అదనంగా మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఙప్తి చేశారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)