తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. 3 నెలల్లో చేయాలి
బీసీ కులగణన 3 నెలల్లో చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది. బీసీ కులగణన చేపట్టాలని హైకోర్టులో 2019లో పిటిషన్ దాఖలైంది. బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై మరోసారి సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. బీసీ కుల గణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నాయని పిటిషనర్ పేర్కొనగా, అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో తాజా ఉత్తర్వులు ఇచ్చి, పిటిషన్పై కోర్టు విచారణ ముగించింది.
Tags :