ASBL NSL Infratech
facebook whatsapp X

అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం : భట్టి

అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం : భట్టి

అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే రైతు భరోసా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో రైతు భరోసా వర్క్‌షాప్‌ నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతుభరోసా పథకం విధివిధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ  అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత`చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి యోచిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. చిన్న రైతుల కోసం పథకాల రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. ప్రజలతో చర్చించి పథకాలు అమలు చేయడమే లక్ష్యమంత్రి మంత్రి పొంగులేటి అన్నారు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :