ASBL NSL Infratech

మహిళల డబ్ల్యూ15 టోర్నీ లో అమెరికా పై.. తెలంగాణ క్రీడాకారిణి విజయం

మహిళల డబ్ల్యూ15 టోర్నీ లో అమెరికా పై.. తెలంగాణ క్రీడాకారిణి విజయం

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల డబ్ల్యూ15 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సహజ 6-4, 7-6( 7/4)తో జు అమీ (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన క్రమంలో సహజ టోర్నీ మొత్తం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ గెలుపుతో అమెరికాలో ప్రొ టైటిల్‌ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారిణిగా సహజ గుర్తింపు పొందింది.  గతంలో సానియా మీర్జా ( 2004లో డబ్ల్యూ15-బోకా రాటన్‌), కర్మన్‌కౌర్‌ (2023లో డబ్ల్యూ60-ఈవాన్స్‌ విల్లె) ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో సహజ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు పురోగతి సాధించి కెరీర్‌ బెస్ట్‌ 305వ ర్యాంక్‌కు చేరుకుంది. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :