అమెరికాలో తెలుగు యువకుడి హత్య... నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు
![అమెరికాలో తెలుగు యువకుడి హత్య... నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు](https://www.telugutimes.net/storage/news/news_new_75085.jpg)
అమెరికాలో తెలుగు యువకుణ్ని తుపాకీతో కాల్చి చంపిన ఘటనలో నిందితుణ్ని టెక్సస్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) డాలస్లోని సూపర్ మార్కెట్లో పని చేస్తుండేవారు. ఈ నెల 21న విధుల్లో ఉండగా, స్టోర్కు వచ్చిన దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గోపీకృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 21 ఏళ్ల దవోంటా మాథిస్ అనే యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు స్టోర్లో దొంగతనానికి వచ్చాడని, గోపీకృష్ణ విధుల్లో ఉండటంతో కాల్పులకు తెగబడ్డాడని తెలిపారు. నిందితుడు ఈ నెల 20న మరో వ్యక్తి కూడా కాల్పులకు చంపాడని పోలీసులు వెల్లడిరచారు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత కాన్సులేట్ నిర్దేశిత ప్రక్రియను పూర్తి చేస్తోంది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :