ASBL NSL Infratech

అమెరికాలో తెలుగు యువకుడి హత్య... నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు

అమెరికాలో తెలుగు యువకుడి హత్య... నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు

అమెరికాలో తెలుగు యువకుణ్ని తుపాకీతో కాల్చి చంపిన ఘటనలో నిందితుణ్ని టెక్సస్‌ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) డాలస్‌లోని సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తుండేవారు. ఈ నెల 21న విధుల్లో ఉండగా, స్టోర్‌కు వచ్చిన  దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గోపీకృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 21 ఏళ్ల దవోంటా మాథిస్‌ అనే యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు స్టోర్‌లో దొంగతనానికి వచ్చాడని, గోపీకృష్ణ విధుల్లో ఉండటంతో కాల్పులకు తెగబడ్డాడని తెలిపారు. నిందితుడు ఈ నెల 20న మరో వ్యక్తి కూడా కాల్పులకు చంపాడని పోలీసులు వెల్లడిరచారు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత కాన్సులేట్‌ నిర్దేశిత ప్రక్రియను పూర్తి చేస్తోంది. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :